Allu Arjun: పుష్ప 2 అప్డేట్ కోసం ఆందోళనకు దిగిన అభిమానులు?

  • November 14, 2022 / 04:13 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చినటువంటి చిత్రం పుష్ప. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎంతో అద్భుతమైన విషయాన్ని సొంతం చేసుకున్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చినటువంటి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ విధంగా సౌత్ నార్త్ అనే తేడా లేకుండా భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరీజానికి ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు.పుష్ప సినిమా ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప 2 త్వరలోనే పట్టాలెక్కబోతోంది అంటూ గత ఏడాది నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విధంగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

పుష్ప సినిమా విడుదలయ్యి డిసెంబర్ 17వ తేదీకి ఏడాది పూర్తి అవుతుంది ఇలా సినిమా విడుదలై సంవత్సరమైనప్పటికీ ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలు కాకపోవడంతో అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలంటూ అల్లు అర్జున్ అభిమానులు గీత ఆర్ట్స్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు.ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వకపోతే తాము మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ఎదుట కూడా ధర్నా చేస్తామంటూ డిమాండ్ చేస్తున్నారు.మరి అభిమానుల ఆందోళనలపై మేకర్స్ స్పందించి ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus