Allu Arjun, Jr NTR: రామోజీ ఫిలిం సిటీలో డిష్యుం.. డిష్యుం అంటున్న తారక్ బన్నీ!

  • April 18, 2023 / 08:09 PM IST

టాలీవుడ్ క్రేజీ హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్ ప్రస్తుతం వారి తదుపరి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం వారి సినిమా షెడ్యూలను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుంటున్నారు. సుకుమార్ అల్లుఅర్జున్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 2సినిమా షూటింగ్లోని కొన్ని యాక్షన్స్ సన్ని వేషాలను రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా సెట్స్ వేసి జరుపుతున్నట్టు సమాచారం.

మరోవైపు ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న NTR 30 సినిమా షెడ్యూల్ చిత్రీకరణ కూడా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను కొరటాల చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నటువంటి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సైతం హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ క్రమంలోనే సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ షూటింగ్ సెట్లోకి అడుగు పెట్టినటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు రామోజీ ఫిలిం సిటీ లో యాక్షన్ సన్నివేశాలలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRRసినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్నో అంచనాల నడుమ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు ఇప్పటికే ఈమె కూడా హైదరాబాద్ చేరుకొని ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus