Allu Sirish: ఎన్టీఆర్ గురించి అలాంటి పోస్ట్ చేసిన శిరీష్.. ఫోటో వైరల్!
November 17, 2023 / 07:37 PM IST
|Follow Us
తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు వారసుడిగా పలు సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అల్లు శిరీష్ ఒకరు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవడం కోసం శిరీష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈయనకు మాత్రం సరైన స్థాయిలో సక్సెస్ అందలేదని చెప్పాలి. పలు సినిమాలలో నటిస్తున్న శిరీష్ మాత్రం తన అన్నయ్య అల్లు అర్జున్ స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోని అల్లు శిరీష్ (Allu Sirish) సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తోపాటు ఇతర సినీ సెలబ్రిటీ లందరూ కూడా చిరంజీవి ఇచ్చినటువంటి దీపావళి పార్టీలో పాల్గొని సందడి చేశారు .ఈ క్రమంలోనే అల్లు శిరీష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకువచ్చారు.
ఫ్రెండ్స్ ఫ్యామిలీ అభిమానులు ఎవరైనా తారక్ అన్నతో ఫోటో దిగాలని అడిగిన అన్న ఎప్పుడు అందరితో ఒకేలాగే ఉంటారు. వారికి ప్రేమతో ఒక ఫోటో ఇస్తారు. ఈయన అందరిని ప్రేమించే వ్యక్తి అంటూ ఈ సందర్భంగా అల్లు శిరీష్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఈయన తారక్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేస్తున్నటువంటి ఈ పోస్టు చూసిన ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. జనవరి కల్లా ఈ షూటింగ్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో షూటింగ్ పనులలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతుంది.
Friends, family or fans I see the same warmth and affection whenever someone asks Tarak anna for a photo. The most kind hearted. ♥️♥️♥️ #deepavali2023pic.twitter.com/N5MiXqKQZB