Amala Paul: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమలా పాల్!
- September 13, 2022 / 12:12 AM ISTByFilmy Focus
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో అమలా పాల్ ఒకరు. ప్రస్తుతం తమిళ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్న ఈ నటి తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఆ హీరోల కుటుంబాలనే టార్గెట్ చేయడం గమనార్హం. అమలా పాల్ మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీని కేవలం నాలుగు కుటుంబాలు మాత్రమే ఏలుతున్నాయని అన్నారు.
టాలీవుడ్ ను ఏలుతున్న కుటుంబాలలో హీరోలు, వాళ్ల పిల్లలు మాత్రమే ఉంటున్నారని పేర్కొన్నారు. అదే కాకుండా టాలీవుడ్ హీరోలలో ఒక్కొక్క హీరోకు సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కావాలని అమలా పాల్ చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సినిమాలలో గ్లామర్ రోల్స్ కు, పాటలకు తప్ప మిగతావాటికి హీరోయిన్లు అవసరం లేదని ఆమె అన్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో అలా కాదని ఈ ఇండస్ట్రీలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని అమలా పాల్ వెల్లడించారు.

తమిళంలో నేను హీరోయిన్ గా ఉండటం నా అదృష్టం అని ఆమె కామెంట్లు చేశారు. అమలా పాల్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమలా పాల్ తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో నటించారు. తెలుగు సినిమాలలో నటించి తెలుగు సినిమాలపై అమలాపాల్ ఈ తరహా కామెంట్లు చేయడం సరికాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అమలా పాల్ తను చేసిన కామెంట్ల విషయంలో వెనక్కు తగ్గాలని మరి కొందరు సూచిస్తున్నారు. ఈ తరహా కామెంట్ల వల్ల భవిష్యత్తులో సైతం అమలా పాల్ కు ఇబ్బందులు తప్పవని ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు ఈ తరహా కామెంట్లు చేయడం సరికాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమలా పాల్ కు తెలుగులో కొత్త ఆఫర్లు రావడం కష్టమేనని చెప్పవచ్చు.
బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!













