కరోనా బారిన పడిన అమితాబ్ మరియు అభిషేక్!

  • July 12, 2020 / 08:13 AM IST

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు . ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ట్విట్టర్ ఆయన… తేలికపాటి రోగ లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం జరిగిందని, ఆ పరీక్షలలో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని అన్నారు. అలాగే గత కొద్దిరోజులుగా ఆయనన్నీ కలిసినవారు కోవిడ్ టెస్టులు చేయించుకోవలసినదిగా కోరారు. అలాగే ఆయన కుమారుడు హీరో అభిషేక్ బచ్చన్ సైతం కోవిడ్ బారిన పడ్డారు.

అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ లో తనకు మరియు తండ్రి అమితాబ్ బచ్చన్ కి కోవిడ్ సోకినట్లు తెలియాజేశారు. ఇక తన సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు కోవిడ్ టెస్టులు చేయించుకోవలసినదిగా కోరారు. ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వీరు చికిత్స పొందుతున్నారు. ఇక అభిమానులు ఎవరూ కంగారు పడకండని వారు కోరారు. అమితాబ్ ఏజ్ ప్రస్తుతం 77ఏళ్ళు కావడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

1

2

3

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus