Anasuya: ‘రంగమ్మత్త’ కోసం సుకుమార్ స్పెషల్ సీన్స్!

  • May 19, 2021 / 07:58 PM IST

బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయకు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. దీంతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ‘క్షణం’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న అనసూయకు ఇప్పుడు ‘పుష్ప’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ‘రంగస్థలం’ సినిమాలో అనసూయను రంగమ్మత్త పాత్రలో చూపించి ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన సుకుమార్ ఇప్పుడు మరోసారి అనసూయ కోసం ‘పుష్ప’లో ఓ పాత్రను క్రియేట్ చేశారు.

అయితే ‘రంగస్థలం’లో మాదిరి ‘పుష్ప’లో అనసూయ చేస్తున్నది అంత కీలకమైన పాత్ర కాదని సమాచారం. ఇందులో ఆమె సునీల్ భార్యగా కనిపించనుందని.. మూడు, నాలుగు సీన్లు మాత్రం కేటాయించారని తెలుస్తోంది. అతి తక్కువ నిడివి ఉండే ఈ పాత్ర మొత్తంగా ఐదారు నిమిషాలకు మించి కనిపించదని సమాచారం. అయితే ఇది కొన్నిరోజుల ముందు వరకు ఉన్న అప్డేట్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు.

దీంతో కథను మరింత విస్తరిస్తున్నారు. పాత్రలను పెంచుతున్నారు. అలా పెంచాలన్న పాత్రల్లో అనసూయ రోల్ కూడా ఉందని తెలుస్తోంది. ఆమె కోసం కొన్ని సన్నివేశాలను రాస్తున్నారని.. కథలో ఈ పాత్రను మరింత కీలకంగా మారుస్తున్నారని దాకా సమాచారం. క్యామియో లాంటి రోల్ అయినప్పటికీ.. సుకుమార్ మీద గౌరవంతో చేయడానికి ఒప్పుకున్న అనసూయకి ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి సినిమాకి కీలకంగా మారబోతుంది!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus