Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు.. సరిలేని లెక్కలు, 20కోట్లు కట్టండి!

  • September 21, 2021 / 06:46 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రాబోయే సినిమాలకు మాత్రమే కాకుండా గతంలో విడుదలైన సినిమాలు కూడా ఊహించని విధంగా షాక్ ఇస్తోంది. ప్రస్తుతం టికెట్ల రేట్లు కోసం సినిమా ఇండస్ట్రీ పెద్దలు పోరాడుతూ ఉంటే ఊహించని విధంగా ఒక ఝలక్ ఇచ్చింది. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన టికెట్ల ట్యాక్స్ చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లు సమాచారం. దీంతో చిత్ర నిర్మాతలు 20 కోట్లు కట్టాలని ఆదేశాలు జారీ చేశారు

అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలెరు నీకవ్వరు సినిమా గత ఏడాది జనవరి 11న విడుదలైన విషయం తెలిసిందే. ఇక రెండు సంస్థలకు ఒకేసారి కమిట్మెంట్ ఇవ్వడంతో మహేష్ బాబు దిల్ రాజు అనిల్ సుంకర కాంబినేషన్ లో తన సంస్థను కూడా జోడించి ఈ సినిమాను నిర్మించారు. అయితే సినిమా విడుదల అనంతరం అమ్ముడైన టికెట్లు అలాగే కట్టిన ట్యాక్స్ ఏ మాత్రం మ్యాచ్ కాలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర నిర్మాతలను ప్రశ్నించింది.

అంతేకాకుండా 20 కోట్లు తేడా వచ్చిందని వెంటనే ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టి తీరాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై నిర్మాతలు స్పందించలేదు. మరి ఆ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగాయి తెలియాలి ఉంటే అఫీషియల్ గా స్టేట్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus