Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం
- April 26, 2026 / 08:29 PM ISTByPhani Kumar
సమ్మర్ వస్తుందంటే చాలు.. థియేటర్ల దగ్గర బడా స్టార్ల సందడి మామూలుగా ఉండదు. కానీ ఈసారి బరిలో పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో.. ఆ గ్యాప్ను క్యాష్ చేసుకోవడానికి మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలు క్యూ కట్టాయి.
Tollywood
సమ్మర్ హాలిడేస్ కాబట్టి.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అయితే రాబోయే ఈ మే నెల.. టాలీవుడ్లోని(Tollywood) ఓ ముగ్గురు సెలబ్రిటీల కెరీర్కు మాత్రం అత్యంత కీలకంగా మారబోతోంది.

మరి బాక్సాఫీస్ వద్ద తమ ఫేట్ డిసైడ్ చేసుకోబోతున్న ఆ ముగ్గురు స్టార్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
నిఖిల్: ‘కార్తికేయ 2’ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ గ్రాఫ్ సడెన్గా డ్రాప్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘స్పై’ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అందుకే తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కిన ‘స్వయంభూ’ పైనే నిఖిల్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. యోధుడి గెటప్లో కనిపిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా.. మే 22న థియేటర్లలోకి రాబోతోంది. ప్రోమోలు చూస్తుంటే కంటెంట్ చాలా ప్రామిసింగ్గా అనిపిస్తోంది. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఈ సినిమా నిఖిల్కు కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే.
సమంత: చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తోంది సామ్. నందిని రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ‘మా ఇంటి బంగారం’ అనే ఫ్యామిలీ డ్రామాతో సిల్వర్స్క్రీన్పై మెరవనుంది . మే 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో సమంత ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్గా కూడా మారుతుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్కు ఆమె భర్త, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు కథ అందించడం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎలాగైనా ఈ మూవీతో హిట్ కొట్టి, తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని సామ్ పట్టుదలతో ఉంది.
తరుణ్ భాస్కర్: డైరెక్టర్గా తనకంటూ ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న తరుణ్ భాస్కర్.. హీరోగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. రీసెంట్గా చేసిన అటెంప్ట్స్ పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా.. ఇప్పుడు “గాయపడ్డ సింహం” సినిమాతో మే 1న మరోసారి తన లక్ చెక్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమా మీద ఇండస్ట్రీ వర్గాల్లో మంచి పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నీ అమ్ముడయ్యాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి.. హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు తరుణ్.











