NTR31: ‘ఎన్టీఆర్ 31’ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • June 4, 2021 / 08:54 PM IST

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా మల్టీ స్టారర్ మూవీలో నటిస్తున్న ఎన్టీఆర్..ఆ తర్వాత కచ్చితంగా పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు అని అభిమానులతో పాటు దర్శకనిర్మాతలు కూడా భావిస్తున్నారు. అందుకే అతను తర్వాత నటించబోయే సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లను ఎంపిక చేసుకోవడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమా చేయదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇవి రెండు కూడా పాన్ ఇండియా మూవీస్ గానే తెరకెక్కనున్నాయి. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేయనున్న సినిమాలో అతనికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని ఎంపిక చేసుకోవాలని ప్రయత్నాలు మొదలైనట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ చేయబోతున్న చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్లు కలిసి నిర్మించనున్నాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉన్నట్టు వినికిడి.దీంతో ఆ ఇద్దరినీ కూడా బాలీవుడ్ హీరోయిన్లనే ఎంపిక చేసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఓ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ విషయమై జాన్వీ తండ్రి బోనీ కపూర్ ను కూడా సంప్రదించినట్టు భోగట్టా.! ఇక మరో హీరోయిన్ గా అనన్య పాండే ను ఎంపిక చేసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. ఆమె పూరి తెరకెక్కిస్తున్న ‘లైగర్’ మూవీలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus