Acharya: ఆచార్యలో ఆ పాత్ర కూడా చనిపోతుందా..?

  • April 6, 2021 / 07:52 PM IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆచార్య సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలలో ఒకటి కావడం, అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంచనాలను మించి జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 140 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం.

150 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే ఆచార్య బ్రేక్ ఈవెన్ అయినట్లేనని చెప్పవచ్చు. 150 కోట్ల రూపాయల టార్గెట్ చిన్న టార్గెట్ కాకపోయినా ఆచార్య సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన లాహే లాహే పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సీజీ వర్క్ వల్ల రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నా చిత్రయూనిట్ మాత్రం రిలీజ్ డేట్ గురించి వైరల్ అవుతున్న గాసిప్స్ పై స్పందించడం లేదు.

చిరంజీవి, చరణ్ గతంలో కొన్ని సినిమాల్లో కలిసి నటించినా ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటించలేదు. ఈ సినిమాలో చిరు, చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తుండటంతో ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో చరణ్, పూజా హెగ్డే పాత్రలు చనిపోతాయని తెలుస్తోంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus