Allu Arjun: అల్లు అర్జున్ నంద్యాల కేసు.. హైకోర్టులో పిటిషన్!

  • October 21, 2024 / 03:01 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun)  నంద్యాల పర్యటన అప్పట్లో రాజకీయ వాతావరణంలో పెద్ద దుమారమే రేపింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి విష్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంఘటన తర్వాత ఫ్యాన్స్ మధ్య వివాదం మరింత ముదిరి సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దారి తీసింది.

Allu Arjun

అయితే, అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు ముందస్తు అనుమతులు తీసుకోలేదని అప్పట్లో ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక అనుమతులు లేకుండా భారీ వాహనాలు, బైక్స్ తో ర్యాలీగా వెళ్ళారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా చూడాలని కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, శిల్పా రవిపై నంద్యాల రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా, అల్లు అర్జున్ ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. వచ్చే సోమవారం దీనిపై విచారణ జరగనుంది. ఇక మరోవైపు, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ద్వారా మూవీపై భారీ అంచనాలు నెలకొల్పాయి. నార్త్ లో కూడా బన్నీ ప్రత్యేకంగా జనాల్లోకి వెళ్లి సినిమాను ప్రమోట్ చేయనున్నాడు. ఇక త్వరలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే నంద్యాల కేసుపై కూడా ఆయన స్పందించే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus