సోనూసూద్ ఆత్మకథతో పుస్తకం లాంచ్ … చరణ్ క్వారంటైన్ ముచ్చట్లు

  • December 31, 2020 / 11:40 AM IST

ఈ లాక్ డౌన్ టైములో పేద ప్రజల ఆకలి తీర్చి.. వలస కూలీలకు అండగా నిలిచిన సోనూ సూద్.. రియల్ హీరో అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని ఆత్మకథతో ‘అయాం నో మెసయ్య’ అనే పేరు తో పుస్తకం లాంచ్ అయ్యింది.’ఆచార్య’ సెట్స్ లో ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవికి అందజేశాడు సోనూసూద్.

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో రూపొందిన ‘మాష్టర్’ చిత్రం జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్లలో 100శాతం ప్రేక్షకులను ప్రవేశ పెట్టే విధంగా హీరో విజయ్.. అక్కడి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. కొందరు దీనిని వ్యతిరేకించినప్పటికీ ధనుష్ వంటి స్టార్ హీరోలు విజయ్ కు మద్దతు పలుకుతున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రం జనవరి 15న విడుదల కాబోతుంది. జనవరి 1నుండీ ఏకధాటిగా ప్రమోషన్లు నిర్వహించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల రాంచరణ్ కూడా కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చరణ్ క్వరెంటైన్ లో ఉంటున్నాడు. అతని సతీమణి ఉపాసనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. ముందు జాగ్రత్తగా ఆమె కూడా క్వారెంటైన్ లో ఉంటూ వస్తోంది.

సాధ్యమైనంత త్వరగా 2020ని control +alt+ delete కొట్టేసి 2021 ను స్టార్ట్ చేయాలంటుంది ‘ఆర్.ఎక్స్.100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూవీలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను కీలక పాత్రకు సంప్రదిస్తున్నారట. గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా కీలక పాత్ర పోషించాడు ఉపేంద్ర.

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో చెయ్యబోతున్నాడు. టి.సిరీస్ వారు నిర్మించబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను.. 2021 జనవరి 1న ప్రకటించనున్నారు.

Most Recommended Video


2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus