Ameesha Patel: ‘బద్రి’ హీరోయిన్ పై చీటింగ్‌ కేసు.. కారణం ఏంటో తెలుసా?

  • April 26, 2022 / 07:39 PM IST

పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బద్రి’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది అమీషా పటేల్. అటు తర్వాత మహేష్ బాబు నటించిన ‘నాని’, ఎన్టీఆర్ ‘నరసింహుడు’, బాలకృష్ణ ‘పరమ వీర చక్ర’ వంటి సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ‘బద్రి’ తప్ప మిగిలిన అన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఈమె టాలీవుడ్ కు దూరమైంది. బాలీవుడ్‌లో కూడా ఈమె ఎక్కువ కాలం రాణించలేకపోయింది.

Click Here To Watch NOW

ఇదిలా ఉండగా.. తాజాగా అమీషా పటేల్ పై చీటింగ్‌ కేసు నమోదవ్వడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే… ‘మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ ఈవెంట్ కోసం నిర్వాహకులు హీరోయిన్ అమీషా పటేల్‌ను సంప్రదించారు. ఈ ఈవెంట్‌లో ఆమె ఒక గంట పాల్గొనేందుకు అక్షరాలా రూ.4 లక్షలు వసూలు చేసింది. కానీ ఈవెంట్ కు మాత్రం అరగంట అంటే 30 నిమిషాలే హాజరైంది. దీంతో నిర్వాహకులు అమీషా పై చీటింగ్ కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.

ఈ విషయం పై అమీషా స్పందిస్తూ.. “ఏప్రిల్‌ 23న మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సిటీలో నవచండీ మహోత్సవాలకు నేను హాజరైన మాట నిజమే. స్టార్‌ ఫ్లాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అరవింద్‌ పాండే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు చాలా దారుణంగా ఉంది. నాకు భయాందోళన కలిగింది.అయితే స్థానిక పోలీసులు నా రక్షణ బాధ్యతలు చూసుకున్నారు” అంటూ ఈమె ట్వీట్‌ చేసింది.ఈ కారణంతోనే అమీషా అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాను అని పరోక్షంగా చెప్పినట్టు అయ్యింది.

ప్రస్తుతం ఈమె ‘గడర్‌ 2’ షూటింగ్లో పాల్గొంటుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతుంది. షూటింగ్ స్పాట్ లో ఈమె ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేస్తుంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus