నరేష్-శివాజీ రాజాల క్లాష్ కు కర్టెన్ దించనున్న చిరంజీవి

  • September 5, 2018 / 12:28 PM IST

గత రెండ్రోజులుగా మా అసోసియేషన్ గురించి, మా అసోసియేషన్ లో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అసోసియేషన్ కి వచ్చే సొమ్ములను దుర్వినియోగపరుస్తున్నారు అంటూ సీనియర్ నరేష్ ఆరోపించగా.. అందుకు సమాధానంగా శివాజీ రాజా-శ్రీకాంత్ లు ఒకవేళ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రూవ్ చేస్తే మా అసోసియేషన్ నుంచి తప్పుకోంటామంటూ సవాల్ విసిరారు. ఈ గొడవ కాస్త పెద్దదై చిరంజీవి పేరు కూడా మధ్యలోకి వచ్చింది. దాంతో చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి ఈ గొడవను సెటిల్ చేద్దామనుకొన్నారు. కానీ నరేష్ పేర్కొన్నట్లు మా అసోసియేషన్ లో నిధులను స్వప్రయోజనాల కోసం వినియోగించుకొన్నట్లు రుజువులు నరేష్ చూపడంతో చిరంజీవి కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. నెక్స్ట్ ఈవెంట్ కి వస్తానని మాటిచ్చిన మహేష్ బాబు కూడా ఈ గొడవ కారణంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్నాడని వార్తలొస్తున్నాయి.

అయితే.. మా అసోసియేషన్ కి ఫౌండర్ మెంబర్ అయిన చిరంజీవి మాత్రం తనను అనవసరంగా మధ్యలోకి లాగినప్పటికీ అసోసియేషన్ పేరు పాడవుతుందన్న ఆలోచనతో ఈ ఇష్యూని సెటిల్ చేయాలని ఫిక్స్ అయ్యారట. మరి ఈ గొడవ సర్ధుమణగాలంటే అసలు నిజం బయటకైనా రావాలి లేదా బూస్థాపితం అయిపోవాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus