Chiranjeevi, Nagarjuna, Akhil: అక్కినేని హీరోల సినిమాను మెగాస్టార్ నిర్మించనున్నారా?

  • August 11, 2022 / 10:48 AM IST

చిరంజీవి నాగార్జున మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. నాగ్ హోస్ట్ చేసిన రియాలిటీ షోలలో చిరంజీవి గెస్ట్ గా హాజరైన సందర్భాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. అయితే నాగార్జున అఖిల్ హీరోలుగా చిరంజీవి నిర్మాతగా మోహన్ రాజా డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ రాజా చిరంజీవి హీరోగా లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే చిరంజీవికి మోహన్ రాజా ఒక కథ చెప్పి నాగ్ అఖిల్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కితే బాగుంటుందని వెల్లడించారని సమాచారం.

చిరంజీవికి కూడా కథ ఎంతగానో నచ్చిందని నాగార్జున అఖిల్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటే మాత్రం నేనే ఈ సినిమాను నిర్మిస్తానని చిరంజీవి చెప్పారని బోగట్టా. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవి నిర్మాతగా ఏదైనా ప్రాజెక్ట్ తెరకెక్కితే ఆ సినిమాపై అంచనాలు మామూలుగా ఉండవనే సంగతి తెలిసిందే. మరోవైపు మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.

దర్శకునిగా మోహన్ రాజాకు ఇతర భాషల్లో మంచి గుర్తింపు ఉంది. గాడ్ ఫాదర్ సినిమాతో మోహన్ రాజా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. దసరా పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ఖాతాలో ఈ సినిమాతో భారీ సక్సెస్ చేరడం ఖాయమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ సాధిస్తే చిరంజీవి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus