Posani: మూడోసారి కరోనా… హాస్పిటల్ లో చేరిన పోసాని!

  • April 14, 2023 / 10:59 AM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ రచయిత , దర్శకుడు అయిన పోసాని కృష్ణమురళి.. కరోనా భారిన పడ్డారు. ఇటీవల కాలంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూణే లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొని వచ్చిన పోసాని.. అస్వస్థకి గురవ్వడంతో టెస్ట్ లు చేయించుకోగా అందులో పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు స్పష్టమవుతుంది. దీంతో ఆయన హైదరాబాద్ లో ఉన్న ఎఐజి హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నాడు.

పోసాని కృష్ణమురళి కరోనా భారిన పడటం ఇది మూడోసారి కావడం విశేషం. హైదరాబాద్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 18 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ మొత్తంలో 45 కేసులు వరకు నమోదయినట్టు తెలుస్తుంది. ఇక పోసాని కృష్ణమురళి వయసు 65 ఏళ్ళు కాబట్టి కొంత ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి.. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎంపికయ్యి కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నారు.

ఇక అప్పుడప్పుడు (Posani) పోసాని కృష్ణమురళి చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి అన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , చిరంజీవి వంటి స్టార్ హీరోల పై ఈయన నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల బాలయ్య పై అలాగే అతని పర్సనల్ లైఫ్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసారు. దానికి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పోసానిని ట్రోల్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు పోసాని కరోనా భారిన పడటం పై కూడా సెటైర్లు వినిపిస్తున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus