DSP: ఆ 3 తప్ప.. దేవి చేతిలో ఉన్నవన్నీ మీడియం రేంజ్ ప్రాజెక్టులేనట..!

  • July 22, 2021 / 05:08 PM IST

దేవి శ్రీ ప్రసాద్ ఒకప్పుడు బిజీ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు కూడా బిజీ మ్యూజిక్ డైరెక్టరే..!కాకపోతే ఒకప్పుడు అన్నీ పెద్ద ప్రాజెక్టులకి పనిచేసే వాడు. ఇప్పుడు ఎక్కువగా మీడియం రేంజ్ ప్రాజెక్టులతో సరిపెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం దేవి చేతిలో 4 పెద్ద సినిమాలు ఉన్నాయి. వెంకటేష్- వరుణ్ తేజ్ ల ‘ఎఫ్3’, అల్లు అర్జున్ ‘పుష్ప’, పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ ల ప్రాజెక్టు, బాబీ- చిరు ల ప్రాజెక్టు ఒకటి. ఇవి తప్పితే దేవి చేస్తున్నవన్నీ మీడియం రేంజ్ ప్రాజెక్టులే..!

ఓ పక్క తమన్ కు పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఒకప్పుడు దేవి దరిదాపుల్లో కూడా తమన్ ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. తమన్ పెద్ద పెద్ద సినిమాలతో బిజీగా ఉంటే.. దేవి మీడియం రేంజ్ సినిమాలతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం..రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’,’ఎఫ్3′ , ‘గుడ్ లక్ సఖి’, రామ్-లింగుస్వామి ప్రాజెక్ట్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇతని చేతిలోకి మరో ప్రాజెక్టు కూడా వచ్చి చేరింది. శర్వానంద్ హీరోయిన్ గా రష్మిక హీరోయిన్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఎంపికయ్యాడు. నిజానికి కిషోర్ తిరుమల సినిమాలకి ఎక్కువగా దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందిస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ‘చిత్రలహరి’ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus