ఫ్యామిలీతో కలిసి తిరుమలలో సందడి చేసిన దిల్ రాజు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • March 11, 2023 / 11:19 AM IST

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అందరికీ సుపరిచితమే.ఈ ఏడాది అప్పుడే ‘వారసుడు’ వంటి పెద్ద సినిమాతో ఓ పెద్ద హిట్ కొట్టిన దిల్ రాజు.. ‘బలగం’ అనే చిన్న సినిమాతో మరో హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ‘వారసుడు’ కోసం తమిళనాడు మొత్తం తిరిగొచ్చిన దిల్ రాజు… ‘బలగం’ కోసం తెలంగాణ ఏరియా మొత్తం ఓ రౌండ్ వేసి వచ్చారు. తన ఇమేజ్ ను పక్కన పెట్టి.. ‘బలగం’ కోసం రోడ్ల మీద తిరిగారు.

ఆయన కొట్టని బ్లాక్ బస్టర్లు కాదు… చూడని కలెక్షన్లు కాదు. అయినా సరే ఓ మంచి కథ అందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో దిల్ రాజు అలా తిరిగారు. నిజానికి ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందింది. దిల్ రాజు బ్రాండ్ ఉంది కాబట్టి.. ఓటీటీ నుండి మంచి డీల్స్ వచ్చాయి. నిర్మాతగా నాలుగు డబ్బులు వెనకేసుకునే అవకాశం ఉంది. కానీ ఆయన థియేటర్లలో విడుదల చేసి సినిమాపై తన ప్యాషన్ ఏంటనేది చాటి చెప్పారు.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా దిల్ రాజు తన ఫ్యామిలీతో కలిసి తిరుమల వెళ్లొచ్చారు. తన కొడుకు అన్వై రెడ్డి తలనీలాలు స్వామివారి సన్నిధిలో అర్పించడం కోసం దిల్ రాజు ఫ్యామిలీ తిరుమల వెళ్లినట్టు తెలుస్తుంది. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది దిల్ రాజు ఫ్యామిలీ. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus