శిరీష్ సినిమా ఓకే అయిపొయింది.. డైరెక్టర్ ఎవరంటే..?

  • March 11, 2020 / 04:55 PM IST

మెగా ఫ్యామిలీలో దాదాపు అందరూ దూసుకుపోతున్నారు. కాస్త వెనుకపడినవారెవరైనా ఉన్నారా అంటే.. అల్లు శిరీష్, నిహారిక, కళ్యాణ్ దేవ్ వంటి వారినే చెప్పుకోవాలి. ఇందులో నిహారిక గ్లామర్ రోల్స్ చేయడం లేదు.. వెబ్ సిరీస్ లతో ఓకే అనిపిస్తుంది. ఇక మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ చేసింది ఒక్క సినిమానే కాబట్టి.. అతనికి కూడా ప్రూవ్ చేసుకునే టైం చాలానే ఉంది. కానీ అల్లు శిరీష్ విషయమే కాస్త.. అటు ఇటు అన్నట్టు ఉంది. ఎందుకో ఈ హీరోకి మెగా అభిమానుల సపోర్ట్ కూడా ఎక్కువ ఉండదు. ‘కొత్త జంట’ ‘శ్రీరస్తూ శుభమస్తు’ సినిమాలు తప్ప.. శిరీష్ చేసిన మిగిలిన సినిమాలన్నీ ప్లాపులే..!

‘ఒక్క క్షణం’ ‘ఎబిసిడి’ వంటి సినిమాలు ఇతన్ని మరింత వెనక్కి నెట్టేసాయి. ఏడాది గడుస్తున్నా శిరీష్ ఇంకా తన తరువాతి సినిమాని మొదలు పెట్టలేదేంటి అనుకుంటున్న టైములో.. ఎట్టకేలకు తన తరువాతి సినిమా సెట్ అయ్యిందని తెలుస్తుంది. ఓ తమిళ సినిమా రీమేక్ గా శిరీష్ తరువాతి సినిమా ఉండబోతుందట. ఇప్పటికే దాని హక్కులు కూడా కొనుగోలు చేసారంట. ‘జత కలిసే’ ‘విజేత’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రాకేష్ శశి ఈ రీమేక్ ను తెరకెక్కిస్తాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus