Om Raut, Prabhas: ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ డైరెక్టర్!

  • June 3, 2022 / 05:06 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ ను పూర్తి చేయగా 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు టికెట్ రేట్లు సాధారణ టికెట్ రేట్లతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. అయితే దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ కళ్లను చూసి ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్ర కోసం ఎంపిక చేశానని ఆయన అన్నారు. కళ్లను చూసి మనసు ఎలాంటిదో చెప్పేయవచ్చని ఓం రౌత్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ మనస్సు చాలా మంచి మనస్సు అని ఆయన తెలిపారు. ప్రభాస్ కళ్లు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్ కళ్లను చూసిన తర్వాత నా మనసులో ఉన్న రఘురాముడిని మరింత బాగా ఊహించుకోగలిగానని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రభాస్ కళ్లలో ఉండే ప్రశాంతత ఎంతో స్వచ్ఛమైనదని ప్రభాస్ పై కట్ చెప్పిన ప్రతిసారి అతని కళ్లలో ప్రశాంతత చూశానని ఆయన తెలిపారు. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ రాముడి పాత్రలో నటిసుండగా కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నారు. మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం.

ఇంగ్లీష్ లో కూడా ఈ సినిమా డబ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుని పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ కళ్లలో రౌద్రం ఏ స్థాయిలో కనిపిస్తుందో నిశ్శబ్దం కూడా అదే స్థాయిలో కనిపిస్తుందని ఓం రౌత్ వెల్లడించారు. ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus