Parasuram: పరశురామ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ గీతా గోవిందం సక్సెస్ తర్వాతే పరశురామ్ 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోల దృష్టిలో పడ్డారు. తక్కువ బడ్జెట్ తో గీతా గోవిందం సినిమాను తెరకెక్కించి నిర్మాతలకు భారీ లాభాలను అందించిన పరశురామ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా మహేష్ కీర్తి కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

ఇప్పటికే విడుదలైన సర్కారు వారి పాట టీజర్ అంచనాలను మించి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ డైరెక్టర్ భవిష్యత్తు సినిమాలో హీరోగా అల్లు అర్జున్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పరశురామ్ ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారని బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని సమాచారం. పరశురామ్ కు గీతా గోవిందం సినిమా వల్ల గీతా ఆర్ట్స్ తో సాన్నిహిత్యం ఉంది.

కథ నచ్చితే ప్రతిభ ఉన్న దర్శకులను ప్రోత్సహించే విషయంలో బన్నీ ముందువరసలో ఉంటారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత నాగచైతన్య పరశురామ్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుందని సమాచారం. చైతన్య మూవీ పూర్తైన తర్వాత పరశురామ్ బన్నీ కాంబో ఫిక్స్ అయితే సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉంటాయి. పరశురామ్ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. సర్కారు వారి పాట రిజల్ట్ పై పరశురామ్ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus