Sai Rajesh: ‘బేబి’ నిడివి గురించి డైరక్టర్‌ కామెంట్స్‌.. తగ్గిస్తే ప్రమాదమంట!

  • July 16, 2023 / 05:12 PM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అంటే.. ‘బేబీ’ సినిమా అనే చెప్పాలి. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. సాయి రాజేశ్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి యువత అభిమానాన్ని చూరగొంది. దీంతో మంచి వసూళ్లు కూడా దక్కుతున్నాయి. అలా తొలి రోజే రూ.7 కోట్లు వరకూ కలెక్షన్స్‌ రాబట్టిందట. అయితే సినిమా నిడివిపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్శకుడు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. దాంతోపాటు ఈ కథ ఎవరిది అనే విషయం కూడా చెప్పారు.

ఈ సినిమాను దర్శకుడు (Sai Rajesh) సాయిరాజేశ్‌ ఎవరి జీవితాన్నో స్ఫూర్తిగా తీసుకొని రాసుంటారు అని కొంతమంది ఊహించి కామెంట్లు కూడా చేశారు. అయితే ఇది ఎవరిదో కాదట.. ఆయన నిజ జీవితంలో జరిగిన విషయమేనట. ‘‘20 ఏళ్ల క్రితం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అయితే మా విషయం తెలిసి ఎనిమిది నెలలపాటు ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఆమె ఎక్కడ ఉందో తెలియక నరకం అనుభవించాను. ఇరవయ్యేళ్లు అయ్యాక కూడా ఆ పెయిన్‌ నాకు గుర్తుంది అని చెప్పారు సాయి రాజేష్‌.

ఎనిమిదేళ్లపాటు తాను పడిన బాధను ఒక పాత్రతో స్క్రీన్‌ మీదకు తీసుకురావాలనుకున్నారట. అయితే ఆ కథను హీరోయిన్‌ ఓరియెంటేషన్‌లో కాకుండా.. హీరో ఓరియెంటేషన్‌లో చూపించాను అని చెప్పారు సాయి రాజేశ్‌. కొన్ని సంభాషణల విషయంలో విమర్శలు వస్తుండటంతో దాని గురించి కూడా మాట్లాడారు. కథకు అవసరం కాబట్టే కొన్ని పదాలను వాడాల్సి వచ్చిందని చెప్పారు. అంతేకానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

దాంతోపాటు మరో విషయంలోనూ సినిమా మీద విమర్శలు వస్తున్నాయి. అదే సినిమా నిడివి… ఇటీవల కాలంలో సినిమా నిడివి తక్కువగానే ఉంటూ వస్తోంది. కానీ ఈ సినిమా నిడివి చాలా ఎక్కువ. దీని గురించి రియాక్ట్‌ అయిన సాయి రాజేశ్‌… నిడివి తగ్గిస్తే… హీరోయిన్‌ పాత్ర మరింత నెగెటివ్ అయ్యేది. అందుకే అలా ఉంచేశాం. ఇంకాస్త లెంగ్త్‌ సరిపోక విరాజ్‌ పాత్రకు న్యాయం చేయలేకపోయాను అని కూడా అన్నారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus