దర్శకుడు శంకర్ అదే తప్పు చేస్తున్నారా?

  • January 23, 2022 / 03:41 PM IST

దర్శకుడు శంకర్ తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారనే తెలిసిందే. సినిమాల కోసం చేసే ఖర్చు విషయంలో శంకర్ ఏ మాత్రం రాజీ పడరు. కొన్నేళ్ల క్రితం వరకు ఆయన సక్సెస్ లో ఉండటంతో నిర్మాతలు సైతం ఖర్చు విషయంలో రాజీ పడకుండా శంకర్ సినిమాలను నిర్మించేవారు. అయితే ఈ మధ్య కాలంలో శంకర్ సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగులుస్తున్నాయి. చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో ఒక్క పాట కోసం ఏకంగా పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. పాతిక కోట్ల రూపాయలతో ఒక మిడిల్ రేంజ్ హీరో సినిమా పూర్తవుతుంది. ఈ బడ్జెట్ తో శంకర్ ఒక పాటను తెరకెక్కిస్తున్నారంటే ఈ సినిమాతో భారీ రిస్క్ చేస్తున్నారనే చెప్పవచ్చు. బడ్జెట్ 300 కోట్ల రూపాయలు దాటితే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచే అవకాశాలు ఉంటాయి.

శంకర్ పరిమిత బడ్జెట్ లోనే సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు 200 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. హాలీవుడ్ నిపుణులతో సినిమాను తెరకెక్కిస్తూ ఉండటంతో ఈ సినిమాకు అంచనాలకు అందని స్థాయిలో ఖర్చవుతోంది. 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

చరణ్ కు జోడీగా కియారా అద్వానీ ఈ సినిమాలో నటిస్తున్నారు. వినయ విధేయ రామ సినిమా తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా చరణ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దర్శకుడు శంకర్ బడ్జెట్ విషయంలో తప్పును రిపీట్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus