Shiva Nirvana: షూటింగ్ అయిపోయిందన్నారు.. యాక్సిడెంట్ ఎలా అయినట్టు..!

  • May 24, 2022 / 10:24 AM IST

సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’.సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శివ నిర్వాణ దర్శకుడు. ఇక ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ కశ్మీర్‌ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. షూటింగ్లో భాగంగా సమంత విజయ్ దేవరకొండ ల పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించింది చిత్ర బృందం.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అంతేకాదు ఈ మధ్యనే మొదటి షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది అంటూ చిత్ర బృందం వెల్లడించింది. అయితే తాజాగా షూటింగ్లో భాగంగా విజయ్ దేవరకొండ, సమంత లు యాక్సిడెంట్ కు గురయ్యారు అనే వార్త అందరినీ కలవరానికి గురిచేస్తుంది. కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న సందర్భంలో విజయ్, సామ్ లు …

నదికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపవలసి వచ్చింది. అయితే ఆ సీన్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి వీళ్ళు నీటిలో పడిపోవడంతో వీరికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం విజయ్, సమంతలను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్టు ఆ వార్త సారాంశం. అయితే దర్శకుడు శివనిర్వా‍ణ ట్విటర్‌లో ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. అది ‘ఫేక్ న్యూస్’ అంటూ తేల్చేశాడు.

ఇక ‘ఖుషి’ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్‌ 23న విడుదల కాబోతుంది. ఇక విజయ్- పూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లైగర్’ మూవీ ఆగస్టు 25న విడుదల కాబోతుంది. అలాగే వీరి కాంబినేషన్లో ‘జన గన మణ’ అనే చిత్రం కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus