Disha Patani: ఇండస్ట్రీ ఎంట్రీపై దిశా పటానీ షాకింగ్‌ కామెంట్స్‌… అలా అనొద్దంటూ!

  • March 2, 2024 / 01:59 PM IST

బాలీవుడ్‌లో మోస్ట్‌ సెలబ్రేటెడ్‌ హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. సినిమాల్లో అందం, అభినం చూపించి మెప్పించే ఈ భామ… సోషల్‌ మీడియాలో అందచందాలను విరివిగా వడ్డిస్తూ మెప్పిస్తుంది. అందుకే ఆమె కొత్త ఫొటో పెట్టింది అంటే కుర్రకారుల లవ్‌ సింబల్స్‌ వర్షం కురిపిస్తారు. అయితే అంత అభిమానం మధ్యలోనూ ఆమెను ట్రోలింగ్‌ ఇబ్బందిపెడుతూ ఉంటుంది. నెపోటిజం అంటూ ఆమెను విమర్శిస్తూ ఉంటారు. తాజాగా ఈ విషయంలో ఆమె స్పందించింది.

ఈ రోజు నటిగా మీ ముందు ఉన్నానంటే దానికి కారణం బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ మాత్రమే అని చెప్పింది దిశా పటానీ. వరుణ్‌ తేజ్‌ – పూరి జగన్నాథ్‌ ‘లోఫర్‌’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన దిశా పటానీ ప్రముఖ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ జీవిత కథతో తెరకెక్కిన ‘ఎంఎస్‌ ధోని’ సినిమాతో క్రేజ్‌ సంపాదించంది. ఇన్నేళ్ల కెరీర్‌ గురించి చెప్పండి అంటే ఏమంటారు అని అడిగితే… భావోద్వేగంతో ఆసక్తికర కామెంట్లు చేసింది.

కథానాయికగా నేను ముందు ఉన్నాను అంటే దానికి కారణం కరణే. మోడలింగ్‌ చేస్తున్న సమయంలో నాలోని నటిని గుర్తించింది ఆయనే. 18 ఏళ్ల వయసులో ఆయన నన్ను నటిగా గుర్తించకపోయుంటే ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. కొందరు దీనిని నెపోటిజమని అంటారు. కానీ నేను మాత్రం నటిగా నిరూపించుకునేందుకు నాకిచ్చిన అవకాశం అని అంటాను అని చెప్పింది (Disha Patani) దిశా పటానీ.

ప్రస్తుతం దిశ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హిందీలో ‘యోధ’, ‘వెల్కమ్‌ టు ది జంగిల్‌’ అనే సినిమాలు చేస్తోంది. అవి కాకుండా రెండు పాన్‌ ఇండియా సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’లో దిశా పటానీది కీలక పాత్ర. ఇక సూర్య – శివ కలసి తెరెకెక్కిస్తున్న ‘కంగువ’లో ఈమె కీలక పాత్ర చేస్తోంది. ఈ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఆమె వెళ్లడం పక్కా అంటున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus