దిశా పటానీను చంపేస్తామంటున్నారు!

Ad not loaded.

‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి దిశా పటానీ. ఈ సినిమా తరువాత అమ్మడు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ‘ఎంఎస్ ధోనీ’, ‘భాగీ’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమా ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఊర్రూతలుగిస్తోంది.

తాజాగా బికినీలో తీసుకున్న ఫోటోలను షేర్ చేసి ఇంటర్నెట్ ని షేక్ చేసింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రమాదంలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దిశా పటానీకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఆమెకి ఫోన్ చేసి చంపేస్తామని భయపెడుతున్నారట. అంతేకాకుండా.. పోలీస్ స్టేషన్లకు కూడా ఫోన్ చేసి దిశాను ఎవరూ రక్షించలేరు అంటూ బెదిరిస్తున్నారట.

ఈ ఫోన్ కాల్స్ పాకిస్థాన్ నుండి వస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ కాల్స్ వలన దిశా ప్రాణాలకు ముప్పు ఉందని సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ బెదిరింపు కాల్స్ పై దృష్టి పెట్టినట్లు.. దీని వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus