సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు డబుల్ ఫీస్టే…!

  • May 8, 2020 / 08:22 PM IST

ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్ బాబు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేస్తాను అని చెప్పిన మహేష్ బాబు … స్క్రిప్ట్ నచ్చలేదు అని ఆ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టాడు మహేష్ అంటూ వార్తలు వచ్చాయి.

దాంతో ఇప్పుడు తన తరువాతి చిత్రాన్ని ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని దర్శకుడు పరశురామ్ కూడా కన్ఫార్మ్ చేసాడు. కానీ మహేష్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందా అని వేచి చూస్తున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31 న ఈ చిత్రం గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తారని తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ కు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని తెలుస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజున .. ‘మహేష్ 27’ ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం అంటే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు డబుల్ ఫీస్ట్ అనే చెప్పాలి.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus