పుట్టిన రోజునే తన ఆవేదన వ్యక్తం చేసిన సింగర్ సునీత…!

  • May 11, 2020 / 12:51 PM IST

సింగర్ సునీత… ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఈ వేళలో నీవు’ అంటూ ‘గులాబీ’ సినిమాలో ఒక్క పాట పాడి టాప్ సింగర్ లిస్టు లో చేరిపోయింది. అప్పటి నుండీ ఈమెకు వరుస ఆఫర్లు రావడంతో బిజీ సింగర్ గా మారిపోయింది. నిన్న సునీత పుట్టిన రోజు. అయితే ఆ రోజున సోషల్ మీడియాలో ఆమె ఎంతో బాద పడుతూ కొన్ని విషయాల్ని చెప్పుకొచ్చింది. ‘ అదేంటో కానీ…కారణం లేకుండానే నన్ను కొందరు టార్గెట్‌ చేశారు, తప్పుడు ప్రచారాలు చేశారు.

నా పై గత కొంతకాలంగా వస్తున్న ఫేక్ న్యూస్ లు,రాస్తున్నారు. కొంతమంది జూనియర్‌ సింగర్స్‌ నన్ను దారుణంగా ఇమిటేట్‌ చేయడం కూడా చూసాను. అదే పాటలకు క్లాప్స్‌ కొట్టడం కూడా నేను చూసాను. కేవలం నా గురించి ఫేక్ న్యూస్ లు చెప్పుకోవడానికి వాట్సాప్‌ గ్రూపులు క్రియేట్‌ చేయడం చూస్తున్నా. ఇక కొన్ని వెబ్‌సైట్‌ లలో అయితే నాపై చెత్తగా వార్తలు రాయడం చూశాను. ఇది పక్కన పెడితే వారి సొంత లాభాలు కారణంగా… కొందరు నన్ను అకస్మాత్తుగా విడిచిపెట్టి వెళ్లిపోవడం వంటివి కూడా చూసాను.

నా పర్సనల్ లైఫ్ కు సంబంధించి భయంకరమైన పుకార్లు వ్యాప్తి చెయ్యడం కూడా నేను చూసాను. గెలుపోటములు.. ఎత్తుపల్లాలు ఎన్నో చూసాను. వాటాన్నిటినీ… మౌనంగా ఉంటూనే ఎదుర్కొన్నాను.ఇప్పుడున్న సమాజంలో… ఇలాంటి ఒడుదుడుకులను ఎదుర్కొంటూ… ఒంటరిగా పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యడం ఎంత కష్టమో నేను తెలుసుకున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus