Godavari Movie: 15 ఏళ్ళ ‘గోదావరి’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • May 19, 2021 / 02:09 PM IST

సుమంత్, కమలిని ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గోదావరి’. ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది.. అనేది ఈ సినిమా క్యాప్షన్. పవన్ కళ్యాణ్ తో ‘తొలిప్రేమ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన జి.వి.జి రాజు ఈ చిత్రానికి నిర్మాత. 2006 వ సంవత్సరం మే 19న ఈ చిత్రం విడుదలయ్యింది. ‘పోకిరి’ వంటి పెద్ద సినిమాల నడుమ విడుదలైన ఈ చిత్రం సైలెంట్ గా హిట్టు కొట్టేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ లభించింది. దాంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో బాగానే చూసారు.. ఇప్పటికీ బుల్లితెర పై కూడా మిస్ కాకుండా చూస్తున్నారు. ఇది ఒక క్లాసిక్ అని చెప్పొచ్చు. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 15 ఏళ్ళు కావస్తోంది.

మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 0.92 cr
సీడెడ్ 0.72 cr
ఉత్తరాంధ్ర 0.83 cr
ఈస్ట్ 0.37 cr
వెస్ట్ 0.29 cr
గుంటూరు 0.44 cr
కృష్ణా 0.39 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 1.12 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.21 cr

 

‘గోదావరి’ చిత్రానికి రూ.4.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.5.21 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు ఈ చిత్రం రూ.1 కోట్లు వరకూ లాభాలను మిగిల్చి హిట్ లిస్ట్ లోకి చేరిందని చెప్పొచ్చు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus