పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన ప్రముఖ నిర్మాత..?

  • March 27, 2021 / 07:50 PM IST

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలో విడుదలై మూడేళ్లు గడిచిపోయింది. పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఈ ఏడాది విడుదల కానుండటంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టైన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతుండగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా కథలో కీలక మార్పులు చేశారు. పవన్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమాలో రెండు స్పెషల్ యాక్షన్ బ్లాక్ సీన్స్ ప్లాన్ చేశారని.. ఈ రెండు యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకే హైలెట్ అవుతాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో పవన్ ఫైట్ సీన్ ను చూపించిన సంగతి తెలిసిందే.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పవన్ కు జోడీగా ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తున్నారు. పింక్ లో ఈ రోల్ లేకపోయినా తెలుగు కోసం దర్శకుడు వేణు శ్రీరామ్ శృతిహాసన్ పాత్రను స్పెషల్ గా క్రియేట్ చేశారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన బోనీ కపూర్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ యాక్షన్ ఎపిసోడ్స్ కు సంబంధించిన విషయాన్ని వెల్లడించారని సమాచారం.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus