Sharwanand: మాస్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన శర్వా.. బ్లాక్ బస్టర్ ఖాయమా?

  • June 1, 2024 / 08:50 PM IST

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ (Sharwanand) మరికొన్ని రోజుల్లో మనమే (Manamey)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా సక్సెస్ సాధించడం శర్వానంద్, కృతిశెట్టి (Krithi Shetty)  డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య  (Sriram Adittya) , పీపుల్స్ మీడియా బ్యానర్ కు కీలకమనే సంగతి తెలిసిందే. మనమే సినిమాకు సంబంధించిన మెజారిటీ సన్నివేశాలను లండన్ లో షూట్ చేయగా ఈ సినిమా ట్రైలర్ కలర్ ఫుల్ గా ఉంది.

అయితే శర్వానంద్ తర్వాత మూవీ సంపత్ నంది (Sampath Nandi) డైరెక్షన్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. రచ్చ (Racha) , బెంగాల్ టైగర్ (Bengal Tiger) సినిమాలతో మాస్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న సంపత్ నంది శర్వానంద్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో శర్వానంద్ కూడా మాస్ రోల్స్ లో కనిపించలేదు. చరణ్ (Ram Charan) డైరెక్టర్ కు శర్వానంద్ ఛాన్స్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

మనమే మూవీ రిలీజైన తర్వాత ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. శర్వానంద్ సంపత్ నంది కాంబినేషన్ ఊహించని కాంబినేషన్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. సాయితేజ్ (Sai Tej) సంపత్ నంది కాంబో మూవీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఆ సినిమాకు బదులుగా ప్రస్తుతం ఈ కాంబో సెట్ అయిందని భోగట్టా.

సంపత్ నంది శర్వానంద్ తో ఎలాంటి కథను తీస్తారో చూడాల్సి ఉంది. శర్వానంద్ కు వరుసగా సక్సెస్ లు దక్కాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. శర్వానంద్ సరైన విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆయనకు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాపై ఈ హీరో దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus