‘ఇస్మార్ట్ శంకర్’ పై కమెడియన్ భద్రం షాకింగ్ కామెంట్స్

Advertisement

‘భలే భలే మగాడివోయ్’ ‘శతమానం భవతి’ ‘మహానుభావుడు’ వంటి చిత్రాల్లో తన కామెడీతో ఆకట్టుకున్న భద్రం అందరికీ గుర్తుండే ఉంటాడు. సినిమాల్లో ఎంతగానో కామెడీ చేసే ఈయన రియల్ లైఫ్ లో ఓ డాక్టర్. ఓ పక్క డాక్టర్ గానూ మరోపక్క యాక్టర్ గానూ బిజీగా గడుపుతున్నాడు భద్రం. అయితే ఈయన తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని చూశాడట. ఈ క్రమంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసి… వార్తల్లో నిలిచాడు. ఏకంగా పూరి జగన్నాథ్ పై కేసు వేస్తానంటున్నాడు.

తన సోషల్ మీడియా ద్వారా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం చూసిన భద్రం స్పందిస్తూ.. ” పూరి జగన్నాధ్ సర్.. ఛార్మీ మేడమ్.. పై నేను కేసు ఫైల్ చేయబోతున్నాను. నేను రోజూ మెడిటేషన్ చేస్తాను. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం చూసిన తర్వాత ధ్యానం చేయలేకపోతున్నాను.. అయితే కొన్ని మెడిటేషన్ క్లాసులు మిస్ అవడం కూడా మంచిదే. ఈ ‘ఇస్మార్ట్’ వీకెండ్ ను ఎంజాయ్ చెయ్యండి” అంటూ ట్వీట్ చేశాడు. అంటే ఇస్మార్ట్ శంకర్ చిత్రం తనకి బాగా నచ్చిందని.. అస్సలు మైండ్లో నుండీ వెళ్ళట్లేదని కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు ఈ కమెడియన్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus