పాపం.. రాజ్ తరుణ్ కు మరో డిజాస్టర్ తప్పేలా లేదు!

  • January 2, 2020 / 07:16 PM IST

రాజ్ తరుణ్, షాలినీ పాండే నటించిన తాజా చిత్రం ‘ఇద్దరి లోకం ఒక్కటే’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ జి.ఆర్. కృష్ణ దర్శకుడు. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. దిల్ రాజు బ్యానర్ నుండీ ఓ చిత్రం వస్తుంది అంటే.. ఆ చిత్రానికి విపరీతమైన హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం పై అలాంటి బజ్ ఏర్పడలేదు. ఇక మొదటి షో తోనే నెగిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదనే చెప్పాలి. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనే పేరు సంపాదించుకున్న ఈ మధ్య హిట్లు కొట్టలేకపోతున్నాడు.

ఇదిలా ఉండగా.. ‘ఇద్దరి లోకం ఒక్కటే’ చిత్రానికి 1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా… 8 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ గా కేవలం 0.68 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. కనీసం ఈ చిత్రం కార్తీ డబ్బింగ్ చిత్రమైన ‘దొంగ’ కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావలి అంటే.. మరో 0.82 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం పెర్ఫార్మన్స్ అంత బాలేదని చెప్పాలి. కనీసం బుకింగ్స్ కూడా అవ్వట్లేదు. ఇలా అయితే రాజ్ తరుణ్ కెరీర్లో మరో డిజాస్టర్ తప్పదనే చెప్పాలి.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus