‘ఇద్దరి లోకం ఒక్కటే’ క్లోజింగ్ కలెక్షన్స్..!

  • May 4, 2022 / 12:56 PM IST

రాజ్ తరుణ్ కు మినిమం గ్యారంటీ హీరో అనే ముద్ర ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో ఈ కుర్ర హీరోకి సరైన హిట్టు లేదు. మార్కెట్ కూడా బాగా డౌన్ అయ్యింది. అయితే ఈ హీరోకి దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసే అవకాశం వచ్చింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఏ సినిమాకి అయినా మంచి బుజ్ ఏర్పడుతుంది. కానీ రాజ్ తరుణ్, షాలినీ పాండే ల.. ‘ఇద్దరి లోకం ఒక్కటే’ చిత్రం విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ జి.ఆర్. కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలైంది.

మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ రావడంతో కలెక్షన్లు కనీసం రాలేదు. ‘ఇద్దరి లోకం ఒక్కటే’ చిత్రానికి 1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా… ఫుల్ రన్లో కేవలం.. అదీ వరల్డ్ వైడ్ గా 0.70 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. డబ్బింగ్ చిత్రమైన ‘దొంగ’ కలెక్షన్లలో సగం కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. మొత్తంగా ఈ చిత్రం కొన్న బయ్యర్స్ కు 0.80 కోట్ల వరకూ నష్టాలు వచ్చాయి. ఒకవేళ ఈ చిత్రానికి దిల్ రాజు మంచి ప్రమోషన్లు నిర్వహించి ఉంటే.. ఓపెనింగ్స్ అయినా వచ్చేవేమో.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus