Dhanush: ‘జగమేతంత్రం’లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్!

  • June 9, 2021 / 02:18 PM IST

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ కోలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు ధనుష్. అతడికి హాలీవుడ్ లో కూడా నటించే ఛాన్స్ వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు అయినప్పటికీ ఎప్పుడూ కూడా ధనుష్ ఆ ఇమేజ్ ను వాడుకోవాలనుకోలేదు. తన సినిమాలతోనే పాపులర్ అవ్వాలనుకున్నాడు. ఇన్నేళ్ల కెరీర్ లో ధనుష్ ఎప్పుడూ కూడా రజినీకాంత్ ను అనుకరించలేదు. కానీ తొలిసారి తన సినిమాలో రజినీకాంత్ స్టైల్ ను అనుకరించానని ధనుష్ చెప్పుకొచ్చాడు.

రజిని సార్ కు తను అభిమానినని.. కానీ అల్లుడుని కాబట్టి ఆయన ఇమేజ్ వాడుకుంటున్నాననే కామెంట్స్ చేస్తారని అలా ఎప్పుడూ చేయలేదని.. కావాలనే ఏ సినిమాలోనూ రజినీకాంత్ మేనరిజం ఫాలో అవ్వలేదని.. కానీ తొలిసారి అలా చేయాల్సి వచ్చిందని ధనుష్ అంటున్నాడు. ఆయన నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తమిళనాడు నుండి లండన్ కు వెళ్లి అక్కడ మాఫియా నాయకుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథే ఈ సినిమా. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈసారి ఎలాగైనా రజినీకాంత్ మేనరిజం వాడదామని ధనుష్ ను కోరాడట. దీంతో ఆయన కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ఆ సన్నివేశాలు ఏ రేంజ్ లో పండుతాయో చూడాలి!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus