షో మొదలు కాబోతుంది.. మొదటి టార్గెట్ అదే..!

  • June 11, 2020 / 10:38 PM IST

‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. 2013లో మొదలైన ఈ షో విశేషాధారణ సొంతం చేసుకుంది. ఎంతో మంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిన షో ఇది. ఈ షోతో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అనసూయ, రష్మీ వంటి వారికి కూడా సినిమాల్లో అవకాశాలు దక్కాయి. ధన్ రాజ్ వంటి వాళ్ళు ‘బిగ్ బాస్’ కు కూడా వెళ్ళొచ్చారు. ఈ కామెడీ షోని టెలికాస్ట్ చేసే ఛానల్ కూడా టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వస్తోంది.

ఈ షో ఆదరణ చూసి .. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ను కూడా మొదలు పెట్టారు. అయితే గత కొన్నాళ్ళుగా ఈ షోకు ఎక్కడా లేని కష్టాలు వచ్చి పడుతున్నాయి. అప్పటి వరకూ జడ్జిగా కొనసాగుతున్న నాగబాబు… ‘అదిరింది’ కి షిఫ్ట్ అయ్యారు. చమ్మక్ చంద్ర వంటి కమెడియన్స్ కూడా ‘అదిరింది’ కి షిఫ్ట్ అయ్యారు. అయినా ‘జబర్దస్త్’ రేటింగ్ కు ఏమాత్రం ఎఫెక్ట్ కాలేదు. అయితే క*నా మహమ్మారి కారణంగా.. 3 నెలల పాటు షూటింగ్ లు నిలిచిపోయాయి.

ఈ క్రమంలో ‘జబర్దస్త్’ వల్ల కూడా ప్రముఖ ఛానల్ టి.ఆర్.పి దెబ్బతింది. త్వరలోనే తిరిగి షూటింగ్ లు మొదలు కాబోతున్నాయి. ఇక నష్టాలను భర్తీ చెయ్యాలి అని.. షో నిర్వాహకులు కూడా భావిస్తున్నారట. ఇందులో భాగంగా ‘జబర్దస్త్’… నటులకు ఇచ్చే పారితోషికాల్లో కోతలు విధించాలని.. వారు భావిస్తున్నారట. అంతంత మాత్రంగా పెర్ఫార్మ్ చేసే వాళ్ళ పారితోషికంలో కోతలు ఎక్కువగా ఉండబోతున్నట్టు సమాచారం. అంతేకాకుండా కొన్ని కొత్త టీం లు కూడా యాడ్ అవ్వనున్నాయని తెలుస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus