Jr NTR: పూరీని ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఏమైందంటే?

  • November 28, 2022 / 12:49 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన టెంపర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి ఈ సినిమా క్లైమాక్స్ కారణమనే సంగతి తెలిసిందే. క్లైమాక్స్ లో ఎన్టీఆర్ తను కూడా తప్పు చేశానని చెబుతూ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ ట్విస్ట్ లేకుండా టెంపర్ సినిమా సక్సెస్ అవుతుందని ఎవరూ భావించలేరనే సంగతి తెలిసిందే.
అయితే వక్కంతం వంశీ తాజాగా ఒక టాక్ షోలో మాట్లాడుతూ

షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. టెంపర్ సినిమా గురించి వంశీ మాట్లాడుతూ టెంపర్ సినిమా కథకు సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో సీడీ ఖాళీగా ఉందని తెలిసిన వెంటనే ఎన్టీఆర్ నలుగురు నిందితులను కోర్టు బయట చంపేసేలా పూరీ ప్లాన్ చేశారని అలా సినిమాను ముగించాలని చెప్పారని వక్కంతం వంశీ అన్నారు. అయితే పూరీ జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ చాలా సింపుల్ గా అనిపించిందని వంశీ తెలిపారు.

ఆ తర్వాత హీరో తనపై నేరం వేసుకునేలా క్లైమాక్స్ లో నేను మార్పులు చేశానని వంశీ చెప్పుకొచ్చారు. నేను చెప్పిన క్లైమాక్స్ తారక్ కు కూడా నచ్చిందని వక్కంతం వంశీ వెల్లడించారు. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు పూరీ జగన్నాథ్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. టెంపర్ మూవీతో కూడా పూరీ జగన్నాథ్ తారక్ కు ఫ్లాప్ ఇవ్వాలని అనుకున్నారా? అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

పూరీ జగన్నాథ్ తనను నమ్ముకున్న హీరోలతో తెరకెక్కించే సినిమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ కు ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇవ్వకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్ల గురించి పూరీ జగన్నాథ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus