Jr NTR , Prashanth Neel: కేజీఎఫ్, సలార్ లను మించి ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్.. కానీ?

  • June 3, 2024 / 12:32 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ షూట్ ఈ ఏడాది ఆగష్టు నెల నుంచి మొదలుకానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా 15 దేశాల్లో ఈ సినిమా షూట్ జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా విదేశాల్లోనే మొదలుకానుందని భోగట్టా. కేజీఎఫ్ (KGF) , సలార్ (Salaar) లను మించి ఎన్టీఆర్ మూవీ విషయంలో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తుండగా ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ బడ్జెట్ పరంగా, విజువల్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేజీఎఫ్ సినిమాకు ఈ సినిమాకు కనెక్షన్ ఉండనుందని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కేజీఎఫ్ యూనివర్స్ లో భాగంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ తెరకెక్కి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారని పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆయన ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కోసం, ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్స్ ఉండగా 2024లో దేవర 2025లో వార్2 2026లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాల బడ్జెట్ దాదాపుగా 1000 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus