Kalyan Ram: మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమా అందుకే ఓకే చేసిందా?

  • December 7, 2021 / 02:14 PM IST

టాలీవుడ్‌లో త్రిపాత్రాభినయం చేసిన హీరోలు చాలా తక్కువ మంది. ఇటీవల కాలంలో అలాంటి ఫీట్‌ చేసిన హీరోలు ఎవరు అంటే ఎన్టీఆర్‌ పేరే వినిపిస్తుంది. ‘జై లవకుశ’లో తారక్‌ ట్రిపుల్‌ రోల్‌ పోషించాడు. ఇప్పుడు అదే ఇంటి నుండి మరో హీరో త్రిపాత్రాభినయం చేయడానికి సిద్ధమవుతున్నాడు. అవును కల్యాణ్‌రామ్‌ తన నెక్స్ట్‌ సినిమాలో మూడు పాత్రల్లో కనిపిస్తాడట. మూడుకు మూడు వైవిధ్యంగా ఉంటాని చెబుతున్నారు. కల్యాణ్‌రామ్‌ గ్యాప్‌ తీసుకుంటే… అది వెరైటీ సినిమాను తీసుకురావడానికే అంటుంటారు.

గతంలో ఓ సారి ఈ విషయం నిరూపించిన కల్యాణ్‌రామ్‌ మరోసారి ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో కల్యాణ్‌రామ్‌ ఓ సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోనే ట్రిపుల్‌ రోల్‌ పోషిస్తున్నాడట. కొత్త దర్శకుడు రాజేంద్ర చెప్పిన కాన్సెప్ట్‌ బాగా నచ్చడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడట. నిజానికి కల్యాణ్‌రామ్‌ ఇప్పటివరకు కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే… కొన్ని ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాలన్నీ చేదు అనుభవాన్నే మిగిల్చాయి.

అయితే ‘బింబిసార’తో మరోసారి ప్రయోగం చేస్తున్నాడు. ఆ వెంటనే ఇప్పుడు ట్రిపుల్‌ రోల్‌తో మరో ప్రయోగం చేస్తున్నాడు. అయితే ఇక్కడో విషయం. మైత్రీ మూవీ మేకర్స్‌కు సినిమాల కథ ఎంపిక మీద మంచి పట్టు ఉంది అంటుంటారు. ఆ లెక్కన వాళ్లు ఓకే చేశారు అంటే… విషయం ఉండే ఉంటుంది అనుకోవచ్చు. సో ఆల్‌ ది బెస్ట్‌ కల్యాణ్‌రామ్‌.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus