Kamal Haasan: ‘క్షత్రియ పుత్రుడు’ సీక్వెల్ కోసం కమల్ ప్లాన్!

  • August 28, 2021 / 03:59 PM IST

శివాజీ గణేశన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘తేవర్ మగన్’ అనే సినిమా 1992లో విడుదలైంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. కమల్ హాసన్ కెరీర్ లో ఇదొక బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే సినిమాను తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా విడుదలైన దాదాపు మూడు దశబ్దాలు గడుస్తుండగా.. ఇప్పుడు సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

మరో విశేషమేమిటంటే.. సీక్వెల్ కోసం కమల్ హాసన్ స్వయంగా కథను రాస్తున్నారట. ‘తేవర్ మగన్’ సినిమాను భరతన్ అనే దర్శకుడు డైరెక్ట్ చేయగా.. ఇప్పుడు సీక్వెల్ కోసం టాలెంటెడ్ డైరెక్టర్ ను రంగంలోకి దించుతున్నారు. ‘టేక్ ఆఫ్’, ‘సీ యూ సూన్’, ‘మాలిక్’ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ నారాయణన్ ఈ సీక్వెల్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. కమల్ హాసన్ నటిస్తోన్న ‘విక్రమ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ‘క్షత్రియ పుత్రుడు’ సీక్వెల్ లో కూడా కనిపిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus