Prabhas: ప్రభాస్ సినిమాలో కరణ్ వాటా.. అశ్వనీదత్ ఒప్పుకుంటారా..?

  • January 29, 2022 / 06:47 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క ‘ఆదిపురుష్’, ‘సలార్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమాను అశ్వనీదత్ ఒక్కరే సోలోగా నిర్మించాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా ఎంటర్ అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించబోతున్నారట. హిందీలో కరణ్ జోహార్ కి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. ‘బాహుబలి’ సినిమాను అక్కడ ప్రమోట్ చేసి.. సినిమా రీచ్ ను పెంచింది కరణ్ జోహారే. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో కూడా తన పాత్ర ఉంది.

‘లైగర్’ సినిమాకి కూడా పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు సినిమాలను హిందీలో రిలీజ్ చేయాలంటే కరణ్ జోహార్ సపోర్ట్ ఉండాల్సిందేనని మన నిర్మాతలు భావిస్తున్నారు. కరణ్ జోహార్ కూడా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలపై బాగా ఫోకస్ పెట్టారు. సౌత్ భారీ బడ్జెట్ సినిమాలన్నింటినీ హిందీలో కరణ్ జోహారే రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో కూడా భాగం కాబోతున్నారు. అంతకంటే ముఖ్యంగా.. ‘ప్రాజెక్ట్ K’లో వాటా తీసుకునే ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. మరి దానికి అశ్వనీదత్ ఒప్పుకుంటారో లేదో చూడాలి!

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus