Keerthy Suresh: సర్కారు వారి పాట మూవీలో హైలెట్ ఇదేనా..?

Advertisement

భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా మహేష్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ గా కీర్తి సురేష్ బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు సబార్డినేట్ గా కీర్తి సురేష్ కనిపించనున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజవుతుండటం గమనార్హం. దర్శకుడు పరశురామ్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎమ్బీ ఎంటర్టేన్మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న్ పరశురామ్ సర్కారు వారి పాట సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధిస్తానని భావిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ నత్తనడకన జరుగుతోంది. మహేష్ బాబు ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా నటించనున్నారు. వచ్చే ఏడాది తను నటించిన రెండు సినిమాలు రిలీజయ్యే విధంగా మహేష్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర హైలెట్ అని ఫ్యాన్స్ ను మెప్పించేలా కీర్తి పాత్రను దర్శకుడు పరశురామ్ తీర్చిదిద్దారని సమాచారం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus