Karan Johar: పాపులర్ షోని పక్కన పెట్టిన కరణ్ జోహార్!

  • May 4, 2022 / 05:16 PM IST

బాలీవుడ్ అగ్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ అనే షోని హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో దేశవ్యాప్తంగా బాగా ఫేమస్ అయింది. ఈ షోలో పాల్గొనాలని సెలబ్రిటీలంతా భావిస్తుంటారు. అలాంటి సూపర్ హిట్ షో ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఏడో సీజన్ గ్రాండ్ గా మొదలవుతుందని అభిమానులు ఆశించారు. కానీ ఇప్పుడు షోని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ షోను ఇకపై చేయనని.. ఆపేస్తున్నట్లు ప్రకటించారు కరణ్ జోహార్.

ఈ మేరకు ఆయన ఓ ఎమోషనల్ నోట్ ను షేర్ చేశారు. ‘హలో.. కాఫీ విత్ కరణ్ అనేది నా జీవితంలోనే కాకుండా మీ అందరి జీవితంలోనూ ఓ భాగమైంది. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. మీ అందరి మీద ఆ షో ఎంతో ప్రభావాన్ని చూపించందని భావిస్తున్నాం. ఇప్పుడు బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటనను ఇలా చేస్తున్నాం.. ఇకపై ఈ షోను చేయడం లేదు. మళ్లీ ఇకపై ఈ షో రాదు’ అంటూ రాసుకొచ్చారు.

అయితే కరణ్ జోహార్ ఇలా ప్రకటన చేయడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఇకపై సెలబ్రిటీల పెర్సనల్ విషయాలను ఎవరుఅడుగుతారు ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ షో కారణంగా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారని.. ఆపేయడమే మంచి విషయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కరణ్ సినిమాల విషయానికొస్తే.. ‘రాఖీ ఔర్‌ రాణీ కీ కహానీ’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది.

ధర్మ ప్రొడక్షన్‌, వయోకామ్‌ 18 సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఇటీవల కరణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus