అలీ షోలో ఎమోషనల్ అయిన కోటా, బాబు మోహన్!

  • November 26, 2020 / 12:42 PM IST

కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్ ని ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు. ఇప్పటికీ టీవీలో వీరిద్దరు కలిసి నటించిన సన్నివేశాలు వస్తుంటే చూస్తూ నవ్వుకుంటారు ప్రేక్షకులు. అంతగా అందరినీ ఎంటర్టైన్ చేశారు. దర్శకుడు వీరికోసం సెపరేట్ గా ట్రాక్ లు రాసుకునేవారు. ఆ తరువాత బాబు మోహన్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో వీరి కాంబోలో సినిమాలు రాలేదు. కోటా కూడా తన వయసుకి తగ్గ పాత్రలు వేసుకుంటూ కొన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారు.

చాలా కాలం తరువాత వీరిద్దరూ కలిసి అలీ షోలో కనిపించారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో మొత్తం కూడా చాలా ఫన్నీగా ఉంది. బాబు మోహన్ పై కోటా పంచ్ లు వేయడం, మధ్యలో అలీకి ఒకట్రెండు కౌంటర్లు ఇవ్వడం ఇలా అంతా సరదాగా సాగిపోయింది. అయితే చివర్లో కోటా తమ జీవితంలో జరిగిన విషాద సంఘటనను గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. బాబు మోహన్, కోటా వీరిద్దరి కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన కోటా.. బాబు మోహన్ కి ఉద్దేశిస్తూ.. ‘వాడికి, నాకూ ఓ కనెక్షన్ ఉంది.. వాడికి అబ్బాయి పోయాడు, నాకూ అబ్బాయి పోయాడు. కాకపోతే వాడికి కొంచెం అదృష్టం ఏంటంటే.. ఇంకో కొడుకు ఉన్నాడు. నా ఒక్కగానొక్క కొడుకు పోవడం’ అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంయాదృచ్ఛికం అంటూ బాబు మోహన్ కూడా కన్నీరు పెట్టుకున్నారు.


బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus