పరుశురామ్ తో మూవీ అంటే పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్

  • May 8, 2020 / 04:39 PM IST

టాలీవుడ్ లో అత్యంత ఫ్యాన్ బేస్ కలిగిన హీరో మహేష్. ఆయనకున్న క్రేజ్ రీత్యా రెమ్యూనరేషన్ భారీగా అందుకుంటున్నారు. దీనితో తోడు ఆయన హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి ఫార్మ్ లో కొనసాగుతున్నాడు. ఆయన సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు ఎంత పెద్ద విజయం సాధించిందో చూశాం. భారీ వసూళ్లు సాధించిన సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ ఫిగర్ సాధించడమే కాకుండా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈనెల 31న తన తండ్రిగారైన కృష్ణ పుట్టిన రోజు సంధర్భంగా తన కొత్త చిత్ర ప్రకటన చేయనున్నాడు.

గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా ఫోకస్ లోకి వచ్చిన డైరెక్టర్ పరుశురామ్ తో మహేష్ కమిట్ అయ్యారు. ఆయన మహర్షి మూవీ చేసిన వంశీ పైడిపల్లిని కూడా పక్కన పెట్టి పరుశురామ్ వైపు మొగ్గు చూపారు. వంశీ మూవీని మహేష్ హోల్డ్ లో పట్టినప్పుడు ఫ్యాన్స్ ఒకింత హ్యాపీగా ఫీలయ్యారు. ఆయన మహేష్ కి మహర్షి వంటి హిట్ మూవీ ఇచ్చినప్పటికీ మరో కొత్త దర్శకుడిని మహేష్ ట్రై చేస్తే బాగుండు అని వారు ఫీలయ్యారు.

కాగా ఇప్పుడు పరుశురామ్ తో మూవీ విషయంలో కూడా ఫ్యాన్స్ అంత సంతృప్తిగా లేరని తెలుస్తుంది. దానికి కారణం పరుశురాం ఇంత వరకు ఓ స్టార్ హీరోతో మూవీ చేయలేదు. ఆయన డైరెక్ట్ చేసిన పెద్ద హీరో రవి తేజ మాత్రమే. ఆయనతో చేసిన రెండు చిత్రాలు ప్లాప్ గా నిలిచాయి. కాబట్టి మహేష్ ని హ్యాండిల్ చేయగలడా, ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమా తీయగలడా అనే అనుమానం మరియు అసహనం వారిలో ఉంది. మరో వైపు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందని పరుశురామ్ చెప్పుకొస్తున్నారు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus