వెంకీ కుడుముల కథకు ఓకే చెప్పిన మహేష్ బాబు

  • March 17, 2020 / 11:18 AM IST

“భరత్ అనే నేను, మహర్షి” వంటి సీరియస్ & రెస్పాన్సబుల్ సినిమాల్లో నటించినప్పటికీ దక్కని కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఒక్క కామెడీ సినిమా “సరిలేరు నీకెవ్వరు”తో అందుకున్నాడు మహేష్ బాబు. ఒక్క ఓవర్సీస్ తప్పితే అన్నీ చోట్లా “సరిలేరు నీకెవ్వరు” చిత్రం సరికొత్త రికార్డులు సృష్టించింది. దాంతో మహేష్ పంధాను మార్చుకొని తదుపరి చిత్రం కూడా యువ దర్శకులతోనే చేయడానికి మక్కువ చూపడం మొదలెట్టాడు. ఆ కారణంగానే తన 27వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆ సినిమాను హోల్డ్ లో పెట్టి పరశురామ్, అనిల్ రావిపూడిల పేర్లు పరిశీలిస్తున్నాడు.

అయితే.. తాజా సమాచారం ప్రకారం మహేశ్ ఇటీవల వెంకీ కుడుముల చెప్పిన కథకు ఒకే చెప్పాడని తెలుస్తోంది. ఇమ్మీడియట్ గా కాకపోయినా రానున్న మూడు నాలుగు సినిమాల్లో ఏదో ఒకటి వెంకీతో చేయాలని మాత్రం ఫిక్స్ అయ్యాడట. ఎలాగూ పరశురామ్ ప్రొజెక్ట్ పైప్ లైన్ లో ఉంది, వంశీతో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే క్లారిటీ ఇప్పటివరకూ లేదు. ఇవి కాకుండా మహేష్ కి పెద్ద కమిట్మెంట్స్ కూడా లేవు. అందువల్ల మహేష్ బాబు నుండి ఆయన అభిమానులు నెక్స్ట్ ఫిలిమ్స్ గా యాక్షన్ & సీరియస్ ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదన్నమాట. మరి మహేష్ పట్టిన ఈ కామెడీ బాట ఆయనకు ఏమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus