పరశురామ్ కి కీర్తి సురేష్ ను రిఫర్ చేస్తున్న మహేష్

  • March 26, 2020 / 01:09 PM IST

ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అని అడిగితే తెలుగు, తమిళ ప్రేక్షకులు ముక్తకంఠంతో చెప్పే పేరు “కీర్తి సురేష్”. తమిళంలో విజయ్, శివకార్తికేయన్, సూర్య వంటి స్టార్ హీరోలలందరి సరసన కథానాయికగా నటించిన కీర్తిసురేష్.. తెలుగులోనూ నాని, రామ్, పవన్ కళ్యాణ్ ల సరసన నటిస్తూ ఇక్కడ కూడా స్టార్ డమ్ అందుకొంది. ప్రస్తుతం కీర్తి తనకు కావాలంటే తనకు కావాలని యంగ్ హీరోస్ అందరూ క్యూ కడుతున్నారు.

యంగ్ హీరోస్ మాత్రమే కాదు.. ఈ క్యూలో సీనియర్ హీరోస్ కూడా బోలెడుమంది ఉన్నారు. ఇప్పుడు ఈ క్యూలో మహేశ్ బాబు కూడా జాయినయ్యాడు. ముందు అనుకున్న వంశీ పైడిపల్లి ప్రొజెక్ట్ ను పక్కనపెట్టి.. మహేశ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ ను కోరుకొంటున్నాడట మహేశ్.

ఇందుమేరకు పరశురామ్ కు ఆల్రెడీ ఆమెను సూచించాడని. ఈ కరోనా కల్లోలం తగ్గాక ఆమెను సైన్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో అజ్ణాతవాసి అనంతరం మరో పెద్ద సినిమా చేయని కీర్తి సురేశ్ కి మహేశ్ ప్రొజెక్ట్ ఒక బూస్టర్ లాంటిది. మరి ఈ బూస్టర్ ను అమ్మడు ఎలా వినియోగించుకుంటుంది అనేది చూడాలి. ఆమె నటించిన “మిస్ ఇండియా” త్వరలోనే విడుదలకానుంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus