Mahesh Babu, Ram Charan: ఒకే ఫ్రేమ్ లో మహేష్, చరణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Ad not loaded.

ఈరోజు టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంగత స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. దాదాపు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఏ.ఎన్నార్ విగ్రహ ఆవిష్కరణ కూడా చేయడం విశేషం. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఈ వేడుకకు హాజరయ్యారు.మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

వీరిద్దరూ పక్క పక్కనే కూర్చుని నవ్వుకుంటూ ఆత్మీయంగా మాట్లాడుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్, చరణ్ అభిమానులు ఈ ఫోటోలకు లైకులు వర్షం కురిపిస్తూ.. ‘సూపర్’ , ‘వీరి కాంబోలో మల్టీస్టారర్ కూడా వస్తే బాగుణ్ణు’ ‘ ‘గుంటూరు కారం’ తో ‘గేమ్ ఛేంజర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ షూటింగ్ జూబ్లీ హిల్స్ లో జరుగుతుంది. మహేష్ బాబుతో పాటు ఇంకొంతమంది నటీనటుల పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక రాంచరణ్ విషయానికి వస్తే.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పార్ట్ కొంత బ్యాలెన్స్ ఉంది. శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. దీని తర్వాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు (Ram Charan) చరణ్.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus