Nikhil: నిఖిల్‌ సినిమా సెట్‌లో ప్రమాదం.. ట్యాక్‌ పగలిపోవడంతో..

ప్రముఖ యువ కథానాయకుడు నిఖిల్ (Nikhil) కొత్త సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘ది ఇండియా హౌస్‌’ సినిమా సెట్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ సమీపంలో ‘ది ఇండియా హౌస్’ సినిమా కోసం ఓ భారీ సెట్‌ రూపొందించారు. సముద్రం మధ్యలో జరిగే సన్నివేశాలు తెరకెక్కించేందుకు ఏర్పాటు చేసిన ఈ సెట్‌లో భారీ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు.

Nikhil

అక్కడే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి ఆ సెట్‌లో సినిమా షూటింగ్‌ జరుగుతుండగా.. ట్యాంక్‌ పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా నీరు వరదగా సెట్‌లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో అసిస్టెంట్‌ కెమెరామన్‌ సహా పలువురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వారికి ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు.

సినిమా షూటింగ్‌ కోసం సిద్ధం చేసిన సామగ్రి నీటిలో పూర్తిగా తడిచిపోయింది. ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సమర్పణలో నిఖిల్‌ – సయీ మంజ్రేకర్‌ జంటగా రూపొందుతున్న సినిమా ‘ది ఇండియా హౌస్‌’. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్‌ నిర్మిస్తున్నాయి.

రామ్‌ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 1905 నేపథ్యంలో ప్రేమ, విప్లవం అంశాలతో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

శ్రీహరిని హీరోగా, కాజల్ ను హీరోయిన్ గా పరిచయం చేసిన ప్రొడ్యూసర్ ఇకలేరు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus