Mansoor Ali Khan: త్రిష, చిరు, కుష్బూలపై కేసు నమోదు చేయనున్న మన్సూర్!

  • November 27, 2023 / 12:57 PM IST

త్రిష మన్సూర్ అలీ ఖాన్ మధ్య జరిగిన వివాదం గురించి తెలిసిందే. త్రిష పట్ల మన్సూర్ అలీ చేసిన కామెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారి తీశాయో మనకు తెలిసిందే. త్రిషతో నాకు రేప్ సన్నివేశాలలో నటించే అవకాశం రాలేదు. త్రిష సినిమా అంటే రేప్ సన్నివేశాలు కచ్చితంగా ఉంటాయని అలాంటి సీన్లు లేవని ఈయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మన్సూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈయన పై చర్యలు తీసుకోవాలని అలాగే ఈయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈయన ఈ వీడియో పై స్పందిస్తూ.. నేను అలాంటి వ్యాక్యాలు చేయలేదు కానీ ఎవరో ఉద్దేశపూర్వకంగా నా మాటలను ఎడిట్ చేశారని మన్సూర్ తెలిపారు. ఇలా తన తప్పులేదని చెప్పిన ఈయన పై విమర్శలు వచ్చాయి. ఇక ఈయన చివరికి త్రిషకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.

అయితే ఈ విషయం పై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందిస్తూ (Mansoor Ali Khan) తన పరువుకు భంగం కలిగించారని ఈయన చిరు,త్రిష, ఖుష్బూ ముగ్గురి పై కేసు వేయబోతున్నారని తెలుస్తుంది. వీరు తన పరువుకు నష్టం కలిగించారు. పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేస్తున్నారు.

నవంబర్ 11వ తేదీ తాను నిజమైన వీడియోని పంపించానని తెలిపారు. అంతేకాకుండా మరికొన్ని సరైన ఆధారాలతో కేసు నమోదు చేయబోతున్నట్లు తెలిపారు. మన్సూర్ క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు అనుకుంటే తిరిగి కేసు నమోదుచేసి ఈ గొడవను మరింత పెద్దది చేస్తున్నారని తెలుస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus